ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఓ అమ్మాయి హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలానే అనుకున్నంత ఎత్తుకి ఎదిగి రెండు సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక దీంతో ఈమెకి ఎవరి దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ ముగ్గురు కామాంధుల చేతిలో బలైపోయింది. ఇంత జరిగినప్పటికీ వారికి మాత్రం ఎటువంటి శిక్ష పడకుండా.. 20 సంవత్సరాలుగా ఆ హీరోయిన్ కి న్యాయం జరగలేదు. ఇక తన కూతురికి న్యాయం జరగాలని ఆ హీరోయిన్ అమ్మ చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు ప్రత్యూష. ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే తన తండ్రి మరణించారు.
దీంతో ఈమె కుటుంబ బాధ్యతలు మొత్తం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇక ఈమె చదువు కోసం గౌతమి అనే కాలేజీలో జాయిన్ అయింది. ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్. ఇక ఈ క్రమంలోనే తన క్లాస్మేట్ అయినా సిద్ధార్థ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఘాటు ప్రేమగా మారింది. ఇక ఇదిలా ఉండగా అప్పట్లో జెమినీ టీవీ వారు కండక్ట్ చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి.. సినిమాలు నటించడానికి ప్రత్యూష స్నేహితులు తమ ఫొటోస్ ని పంపించారు. ఇక ఈ క్రమంలోనే ప్రత్యూష కూడా ఈ ప్రోగ్రాం కి తన ఫొటోస్ ని పంపించింది. ఇక సెలెక్ట్ అయ్యింది కూడా. ఆలా సెలెక్ట్ అయిన ఈమె రాఘవేంద్రరావు, రాకేష్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకుంది. ఇక ఈ తరుణంలోనే సిద్ధార్థ్, ప్రత్యూష కి మరింత దగ్గరయ్యాడు.
ఇక మోహన్ బాబుతో అప్పటికే ఒక సినిమా చేస్తున్న ప్రత్యూష నటనకు మోహన్ బాబు ఫిదా అయ్యాడు.
ఇక దీంతో తన తరువాత సినిమా అయినా రాయుడు లో కూతురి పాత్రలో ఈ ముద్దుగుమ్మని సెలెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాతో ఈమె భారీ పాపులారిటీ దక్కించుకుందని చెప్పవచ్చు. ఇక ఇలాంటి చిన్న చిన్న పాత్రలలో నటించవద్దని హీరోయిన్ గా అవకాశం వస్తేనే నటించమని తన తల్లి చెప్పడంతో సైడ్ క్యారెక్టర్ లని చేయడం మానేసింది ప్రత్యూష. ఇక ఆరు నెలల గడిచిన అనంతరం చెన్నై నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అమెకు కాల్ చేసిన వ్యక్తి.. నేను సినిమా కోసం ఫోన్ చేశాను.
మీ అమ్మాయిని మా సినిమాలో హీరోయిన్గా పెట్టుకుందాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రేపు ఉదయమే చెన్నైకి బయలుదేరి రండి.. అని ప్రత్యూష తల్లికి చెప్పాడు. ఇక దీంతో తన తల్లి బాగా ఆలోచించి తన కూతురిని చెన్నైకి పంపించింది. ఇక ఈ షూటింగ్ లో ప్రత్యూష నటనకి భారతి రాజు ఫిదా అయ్యాడు. ఇక ఈమెకి భారీ పాపులారిటీ దక్కడంతో వరుసు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే సిద్ధార్థ్ తో ఎక్కువ సమయం గడప లేక పోయింది ప్రత్యూష. ఇక దీంతో తనకి ప్రత్యూష ఎక్కడ దూరం అవుతుందో అనే టెన్షన్లో సిద్ధార్థ పడ్డాడు.
ఇక దీంతో ప్రత్యూషను వెంటనే పెళ్లి చేసుకోవాలని సిద్ధార్థ నిర్ణయించుకున్నాడు. ఇక ఇదే విషయం ప్రత్యూష కి చెప్పడంతో వెంటనే వీరిద్దరూ కలిసి ప్రత్యూష వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఈమె తల్లి ఇంకో టూ ఇయర్స్ వెయిట్ చేయండి అనంతరం నేనే పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చింది. ఇక సిద్ధార్థ్ తల్లి మాత్రం ప్రత్యూషని కోడలుగా చేసుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు. ఇక ఒకరోజు సిద్ధార్థ తో కలిసి ప్రత్యూష బయటకి వెళ్ళింది. ఇక ఆరోజు సాయంత్రం అయిపోవడంతో ప్రత్యూష తల్లి ఫోన్ చేసి ఎక్కడున్నావమ్మా అని అడుగుతుంది. దీనికి ప్రత్యూష నేను సిద్ధార్థ్ తో ఉన్న ఏమి భయపడకు అమ్మ అని చెప్పి అలానే జయం సినిమాలో నాకు హీరోయిన్ గా అవకాశం వచ్చిందని తెలియజేస్తది.
ఇక దీంతో తన తల్లి కూడా ఎంతో సంతోష పడింది. ఇక కొంతసేపటికి తెలియని నెంబర్ నుంచి ప్రత్యూష తల్లికి కాల్ వస్తుంది. ఆ ఫోన్ చేసిన వారు మీ అమ్మాయితో పాటు మరో అబ్బాయి కూడా విషం తాగి హాస్పటల్లో ఎడ్మిట్ అయ్యారని చెబుతారు. ఇక ఈమె హాస్పటల్ కి వెళ్లే సమయానికి ప్రత్యూష మృతదేహమై ఉంటుంది. తన ప్రియుడు మాత్రం మరుసటిరోజే తిరిగి బయటకు వస్తాడు.ఇక అక్కడ డాక్టర్లు ప్రత్యూష ది ఆత్మహత్య కాదని ముగ్గురు యువకులు ఈమెని అత్యాచారం చేశారని తన తల్లికి తెలియజేస్తారు. ఇక ఈమె అత్యాచారంపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. 20 ఏళ్ల నుంచి తన తల్లికి కడుపుకోత మిగిలింది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!