కరోనా మహమ్మారి చేసిన విలయం అంతాఇంతా కాదు. ఏకంగా 2020లో వ్యవస్థలను కోలుకోలేనంత దెబ్బ తీసింది. ఇందులో వినోద రంగం కూడా ఉంది. సినిమాలు, సీరియల్స్, షూటింగ్స్.. ఏమీ లేవు. ముఖ్యంగా సినీ ప్రియులను పూర్తిగా నిరాశపరచింది. సంక్రాంతికి వచ్చిన సినిమాల మినహా మళ్లీ సినిమాలు లేకుండా పోయాయి. అయితే.. ఈ గ్యాప్ లో ప్రేక్షకులను కాస్త ఆదుకుంది ఓటీటీ ప్లాట్ ఫామ్స్. కొత్త, పాత సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజై ఇంట్లో వినోదాన్ని అందించాయి.
అయితే.. అనుకున్న స్థాయిలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ప్రేక్షకుల్ని రంజింప చేసాయా అంటే కాదనే సమాధానమే వస్తుంది. ఆకట్టుకునే కంటెంట్ ఫిలింస్ రాకపోవడమే ఇందుకు కారణం. పలు వెబ్ సిరీస్ లు, సినిమాలు వచ్చినా అంతగా ఆకట్టుకోలేక పోయాయి. జోష్ ఇచ్చే సినిమాలు రావడం లేదు. రావట్లేదు అనుకునే కంటే.. నిర్మాతలు ఇందులో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ధియేటర్లు తెరిచేందుకు అనుమతులు వస్తాయి అనే ఉద్దేశంతో దాదాపు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు 20వరకూ ఉన్నాయి.
కానీ.. ఈ ఏడాదిలో ధియేటర్లు ఓపెన్ చేస్తారన్న క్లారీటీ లేదు. కరోనా విజృంభణ ఆస్థాయిలో ఉంది. భానుమతి అండ్ రామకృష్ణ, కృష్ణ అండ్ హిస్ లీల.. సినిమాలు పర్వాలేదనిపించాయి. ఫ్యామిలీ మేన్, బ్రీత్, సిన్.. వంటి వెబ్ సిరీస్లు ఆకట్టుకున్నాయి. కానీ.. ప్రేక్షకులకు వినోదాన్ని ఇచ్చే పెద్ద సినిమాలు రాకపోవడం ప్రేక్షకుల్ని నిరాసపరుస్తోంది. మరి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మీడియం రేంజ్ సినిమాలైనా త్వరలో ఓటీటీల్లో వస్తాయేమో చూడాలి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!