బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరం కావడం తెలిసిందే. తనకంటే ఐదు సంవత్సరాల వయసు ఉన్న హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా.. కొద్ది నెలల క్రితం సారగోసి విధానం ద్వారా ఒక పాపకి జన్మనివ్వడం తెలిసిందే. అయితే ఇప్పుడు పుట్టిన పాపకి మరో తోబట్టువు మధ్య ఎక్కువ ఏజ్ గ్యాప్ రాకుండా రెండో సంతానానికి ప్లాన్ చేస్తున్నారట. భర్త నిక్ జోనాస్ ఈ నిర్ణయం తీసుకున్నారట. సారగోసి విధానం ద్వారా పుట్టిన పాపకి మాల్తి మేరీ చోప్రా అనే పేరు పెట్టడం జరిగింది. ఇంకా పాపని బయట ప్రపంచానికి పరిచయం చేయలేదు.
ఇటువంటి తరుణంలో మరో బిడ్డకి.. ఈ దంపతులు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండో బిడ్డ కూడా సర్గోసి విధానం ద్వారా జన్మ నివ్వాలని రెడీ అయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మొదటి బిడ్డ ఫోటోను ఇప్పటికీ కూడా చూపించలేదు. కాగా మెక్సికో బీచ్ లో వారం రోజుల క్రితం ప్రియాంక చోప్రా బర్తడే వేడుకలు జరిగాయి. ఆ సమయంలో కూడా పాప ఫేస్ ఎక్కడ కూడా కనబడనివ్వకుండా దంపతులు జాగ్రత్తపడ్డారు. ఇటువంటి తరుణంలో మరో బిడ్డకు వీరిద్దరూ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు రావటం సంచలనంగా మారాయి.
ప్రియాంక చోప్రా ప్రారంభంలో దక్షిణాది సినిమా రంగం నుండి.. ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కానీ పెద్దగా విజయం సాధించలేదు. అయినా కానీ ఎక్కడ నిరుత్సాహపడకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో విజయవంతంగా రాణించింది. ఆల్మోస్ట్ ఆల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల అందరి సరసన ప్రియాంక చోప్రా నటించడం జరిగింది. ఆ తరువాత నీక్కీ జోనస్ తో ప్రేమలో పడి 2018 వ సంవత్సరంలో వివాహం చేసుకోవడం జరిగింది. ఇటీవల జూలై 18వ తారీకు 40వ జన్మదిన వేడుకలను ప్రియాంక చోప్రా జరుపుకోవడం జరిగింది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!