Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి చాలా వరకు యంగ్ దర్శకులతో పనిచేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే సమయంలో మల్టీస్టారర్ సినిమాలు కూడా చేస్తున్నారు. గతంలో ఓ స్థాయి ఉన్న దర్శకులతో మాత్రమే ఈ హీరోలు నటించేవాళ్ళు. కానీ రీసెంట్ గా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న కొత్త కొత్త దర్శకులు తమ సత్తా అద్భుతంగా వెండి తెర మీద టాలెంట్ చూపిస్తూ ఉండటంతో… వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సీనియర్ హీరోస్ అవకాశాలు ఇస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ప్రోత్సహించే విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు.
ఈ క్రమంలో కొత్తవరి సినిమా విజయం సాధించింది అంటే ఆ సినిమా దర్శకుడికి మరియు హీరోకి ఫోన్ చేసి మరి అభినందనలు తెలియజేస్తారు. ఇదిలా ఉంటే చిరంజీవితో సినిమా చేయటం కోసం చాలామంది దర్శకుల కల. ఆ కలని నెరవేర్చుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రకంగానే చిరంజీవితో సినిమా చేయడానికి ఇప్పుడు ఇండస్ట్రీలో ముగ్గురి దర్శకుల మధ్య పోటీ నెలకొని ఉందట. ఆ దర్శకులు మరెవరో కాదు అనిల్ రావిపూడి, హరిష్ శంకర్ తో పాటు జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్. ఈ ముగ్గురు ఇటీవల చిరంజీవికి స్టోరీ వినిపించినట్లు ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే కథలు విన్న చిరంజీవి ఏ ఒక్కరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. దాదాపు అనిల్ రావిపూడి సబ్జెక్టు ఓకే అయినట్లు మాత్రం గట్టిగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో “విశ్వాంబర” చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి నెలలో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా చేస్తుంది. “విశ్వంభర” సినిమా కంప్లీట్ అయిన తర్వాత అనిల్ రావిపూడి లేదా మిగతా ఇద్దరి దర్శకులలో ఏదో ఒక సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ లో చిరంజీవి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.