కరోనా వైరస్ ఉధృతి తగ్గింది. అది కాకుండా ప్రజల్లో కొద్దిగా భయం తొలగిపోతుంది. కేసులు తగ్గుతున్నాయి అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బుల్లితెరపై కోవిడ్ తన పంజా విసిరింది. ఇప్పటికే సుడిగాలి సుధీర్ కు కొవిడ్ సోకింది అన్న వార్తలు జోరందుకున్నాయి. దాదాపు కన్ఫర్మ్ అందరూ అంటున్నారు. ఇక అతనితో పాటు జబర్దస్త్ లో అతని టీం సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు అని అయితే వారికి నెగిటివ్ వచ్చింది అని చెబుతున్నారు.
నిజానికి కరోనా వైరస్ బుల్లితెరపై ఎప్పుడో తన ఉనికిని చాటుకుంది. నవ్య స్వామి, రవి కృష్ణ, సింగర్ స్మిత, మాళవిక, సాక్షి శివ వంటి తదితరులు ఇప్పటికే కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సుధీర్ ఎఫెక్ట్ తో ఒక్కసారిగా బుల్లితెర నిర్ఘాంతపోయింది. అతను చలాకీగా అందరితో క్లోజ్ గా ఉంటాడు. తాజాగా ఎన్నో షూటింగ్ లు లలో పాల్గొన్నాడు.
ఇలాంటి సమయంలో జబర్దస్త్ కొద్ది రోజులు వాయిదా వేయవలసి వచ్చింది అని ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించడం గమనార్హం. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం జానీ మాస్టర్, హైపర్ ఆది వంటి వారికి కూడా వైరస్ సోకింది అని అంటున్నారు. అయితే మిగిలిన వారికి నెగెటివ్ అని వచ్చింది అని అయితే వీరికి సంబంధించిన డేటా ప్రస్తుతం అందుబాటులో లేదని అంటున్నారు.
మిగతా వారికి నెగెటివ్ అని చెప్పి వీరిది ఎందుకు దాస్తున్నారు అర్థం కావట్లేదట లేదా అక్కడ ఏమీ లేకపోయినా అత్యుత్సాహంతో అందరూ హైపర్ ఆది కి కూడా కరోనా వచ్చింది అని అనుకుంటున్నారా..? అన్నది తేలాల్సి ఉంది. ఈ కన్ప్యూజన్ వదిలి పోవాలంటే వచ్చే ఎపిసోడ్ లో ఆది ఉంటాడా లేదా అన్నది చూడాలి లేకపోతే అతనే అధికారికంగా ప్రకటిస్తే ఒక పని అయిపోతుంది కదా…
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!