2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఘన విజయాన్ని సాధించింది. రాజకీయ ప్రముఖులే కాదు.. సినీ సెలబ్రిటీలు సైతం వై.ఎస్.జగన్కు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. రామ్గోపాల్ వర్మ, సుధీర్ బాబు, రవితేజ తదితరులు ట్విట్టర్ ద్వారా జగన్కు అభినందనలు తెలియజేశారు. ఎన్నికలకు ముందుకు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఆధారంగా చేసుకుని `యాత్ర` సినిమా చేశాడు దర్శకుడు మహి వి.రాఘవ్. ఇప్పుడు “వై.ఎస్.జగన్ అన్నకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ విజయానికి నీవు అర్హుడివి. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిగారు చేసిన దాని కంటే ఎక్కువగానే చేస్తారని నమ్ముతున్నాం. భవిష్యత్ తరాలకు చెప్పుకునేంత గొప్ప విజయాన్ని అందించారు“ అన్నారు.
previous post
next post