19 అమరావతి: అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలయిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం ఆయన గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్కు రాజీనామా లేఖ పంపారు. ఆయన రాజీనామాను గవర్నర్ వెంటనే ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంతవరకూ పదవిలో కొనసాగాల్సిందిగా ఆయన చంద్రబాబును కోరారు. రాష్ట్రానికి గత అయిదేళ్లుగా సేవలు అందించినందుకు గవర్నర్ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
175 స్థానాల శాసనసభలో టిడిపి గురువారం సాయంత్రం ఏడు గంటలకు 17 స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. మరో ఏడు సీట్లలో టిడిపి అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి 107 సీట్లలో విజయం సాధించింది. మరో 42 సీట్లలో ఆ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. జనసేన ఒక్క స్థానంలో గెలుపొందింది.