Sandeep Reddy Vanga: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అందరికీ సుపరిచితుడే. 2017లో తన మొదటి సినిమా విజయ్ దేవరకొండ తో తీసిన “అర్జున్ రెడ్డి” తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవటం జరిగింది. ఈ సినిమాతో అందరి స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించాడు. ఏకంగా ఆ టైంలో మహేష్ బాబు సైతం త్వరలో సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు ప్రకటన చేయడం కూడా జరిగింది. మహేష్ బాబు మాత్రమే కాదు రామ్ చరణ్ సైతం ఆ రకంగానే కామెంట్లు చేయడం జరిగింది. “అర్జున్ రెడ్డి” ఓవర్ నైట్ లోనే సందీప్ రెడ్డికి స్టార్ డైరెక్టర్ ఇమేజ్ తో పాటు విజయ్ దేవరకొండకి స్టార్ హీరో స్టేటస్ తెచ్చింది.
కానీ సందీప్ రెడ్డి వంగ తన రెండో సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో చేయడం జరిగింది. ఇదే “అర్జున్ రెడ్డి” సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో “కబీర్ సింగ్” గా షాహిద్ కపూర్ తో చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అప్పటిదాకా వరుస పరాజయాలతో ఉన్న షాహిద్ కి “కబీర్ సింగ్” మంచి బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు రణబీర్ కపూర్ తో “యానిమల్” అనే డిఫరెంట్ స్టోరీ కంటెంట్ కలిగిన సినిమా చేయటం జరిగింది. ఈ సినిమా డిసెంబర్ మొదటి తారీకున విడుదల కాబోతోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో సినిమా తెరకెక్కించడం జరిగింది. ఇటీవల ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సినిమా రన్ టైమ్ తెలియజేశారు. “యానిమల్” సినిమా 2 గంటల 21 నిమిషాలు రన్ టైమ్ ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.