మాస్ మహారాజా రవితేజ హీరోగా విఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `డిస్కోరాజా`. నభా నటేశ్, పాయల్ రాజ్పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తదుపరి షెడ్యూల్ ఆగస్ట్ 4న ఢిల్లీలో ప్రారంభం కానుంది. తదుపరి షెడ్యూల్ స్విజ్జర్లాండ్లో చిత్రీకరణను జరుపుకోనుంది. ఆ షెడ్యూల్ గురించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.