Rajamouli: దర్శక దీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీని ఓ స్థాయికి తీసుకువెళ్లి ప్రస్తుతం టాలీవుడ్ అంటే రాజమౌళి.. రాజమౌళి అంటే టాలీవుడ్ గా పేరు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటే పెద్దగా ఎవరికి తెలియదు. కానీ బాహుబలి మూవీ తో పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో ప్రతి ఒక్కరికి పరిచయం చేశాడు రాజమౌళి. బాహుబలి సిరీస్ త్రిబుల్ ఆర్ సినిమాతో రాజమౌళి రేంజ్ గ్లోబల్ లెవెల్ కి ఎదిగిందని చెప్పుకోవచ్చు. ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్గా రాజమౌళి పేరును సంపాదించుకున్నాడు. ఇక తాను డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఏ సినిమా కూడా ఇప్పటివరకు అపజయాన్ని వెలుగు చూడలేదు. అందువల్లే రాజమౌళి డైరెక్షన్ పై ప్రేక్షకులు ఎక్కువ శాతం నమ్మకాలు పెడతారు.
ఇక రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు రాజమౌళి దర్శకుడు అవ్వకు ముందు తన సినిమాల్లో ఒకటి ఉండకూడదు అని ఫిక్స్ అయినట్లు తెలిపాడు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఒక దారుణమైన క్లైమాక్స్ చూసి ఆ నిర్ణయానికి రాజమౌళి వచ్చినట్లు తెలుస్తుంది. ఒకవేళ తాను ఫ్యూచర్లో మూవీస్ కనుక తీశారు అంటే అటువంటి ఎడిటింగ్ కచ్చితంగా పెట్టకూడదని రాజమౌళి అనుకున్నారట. జక్కన్న చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలు చూస్తూ బాగా ఇష్టపడే వాడట. ఆయన ఫ్యామిలీలో 13 మంది కజిన్స్ ఉండేవారు. అందులో పెద్దవాళ్లు నెలకు రెండు సినిమాలు చిన్నవాళ్లు మాత్రం నెలకి ఒక సినిమా చూడాలని ఇంట్లో రూల్ ఉండేదట.
ఇక అప్పట్లో వాళ్ల ఊర్లో రెండే థియేటర్లు ఉండేవాట. అందులో ఒక థియేటర్లో ఎన్టీఆర్ అగ్నిపిడుగు ఇంకో థియేటర్లో మంచి చెడు అనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. అగ్గి పిడుగులు చూసి పెద్దవాళ్లు సినిమాలో కత్తి ఫైట్లు యాక్షన్ సీన్స్ ఉన్నాయని అన్నారట. ఇక రాజమౌళి ఎలా అయినా సినిమా చూడాలని అనుకున్నాడట. అగ్గిపిడుగు సినిమాకి వెళ్దామని అనుకుంటే మంచి చెడు సినిమాలో కూడా మంచి ఫైట్లు ఉన్నాయని అబద్ధం చెప్పి కన్విన్స్ చేశారట. యాక్షన్ సీన్స్ లేకపోవడంతో రాజమౌళి నిరాశ చెందారట. ఆఖరికి హీరో చనిపోవడం ఆ సినిమా ఎండింగ్ చూసి రాజమౌళికి కోపం వచ్చిందట.
ఇక అప్పటికే చిరాకు తో ఉన్న రాజమౌళి.. ఎన్టీఆర్ చనిపోవడం చూసి భవిష్యత్తులో కనుక సినిమాలు తీయాలి అంటే ఇటువంటి క్లైమాక్స్ పెట్టకూడదని ఫిక్స్ అయిపోయాడట. అలా ఇప్పటివరకు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఏ సినిమాలలో కూడా హీరోని మృతి చెందినట్లు చూపించలేదు. అలా ఆరోజు జక్కన్న డిసిషన్ పై ఇప్పటికీ కూడా నిలబడి ఉన్నాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అటు జక్కన్న అభిమానులతో పాటు ఇటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. గుంటూరు కారం సినిమాతో ఫ్లాప్టాక్ లో ఉన్న మహేష్ను హిట్ దారివైపుకు తీసుకొచ్చేందుకు జక్కన్న బాగానే కసరత్తులు చేస్తున్నాడని చెప్పొచ్చు.