నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై ఎప్పటికప్పుడు ఆసక్తి నెలకొంటుంది. గతంలోనూ కొన్నాళ్ళు బాలయ్య తన కొడుకుని హీరోగా లాంచ్ చేయడానికి భారీగా సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు బాలయ్య తన కొడుకుని హీరోగా పరిచయం చేసే బాధ్యతను క్రిష్, వి వి వినాయక్, బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్స్ కి అప్పగించినట్టు చెప్పుకొచ్చారు. అయితే ఎందుకనో అది వార్తగానే మిగిలిపోయింది.
ఇప్పుడు మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీ పై వార్త తెరమీదకి వచ్చింది. గత కొన్ని రోజులుగా బాలయ్య మోక్షజ్ఞ ని తెలుగు తెరకి హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్దం చేస్తున్నట్టు న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతోంది. అయితే ఈ సారి దర్శకుల జాబితాలో బోయపాటి శ్రీను తో పాటు సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు కూడా వినిపిస్తుంది. వాస్తవంగా అనిల్ రావిపూడి బాలయ్య తో రామారావు అన్న టైటిల్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడని సమాచారం.
కాని తాజా సమాచారం ప్రకారం బాలయ్య తో కాకుండా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ని డైరెక్ట్ చేయబోతున్నాడని అంటున్నారు. ఇదిలా ఉండగానే మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు అద్భుతంగా మాటలు రాసిన సాయి మాధవ్ బుర్రా మొదటిసారి దర్శకత్వం వహించబోతున్నట్టు ఆ సినిమా మోక్షజ్ఞ దే అని వార్తలు వస్తున్నాయి. ఎంతో పవర్ ఫుల్ డైలాగ్స్ రాసే సాయి మాధవ్ బుర్రా కి బాలయ్య మోక్షజ్ఞ ని వెండి తెరకి పరిచయం చేసే బాధ్యతను అప్పగించినట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!