Bala Surya: దక్షిణాది సినిమా రంగంలో లెజెండ్రీ డైరెక్టర్ లలో ఒకరు బాలచందర్. బాలా దర్శకత్వంలో ఎన్నో మరపురాని సినిమాలు రిలీజ్ అయి… రికార్డులు సృష్టించడం తెలిసిందే. ముఖ్యంగా డైరెక్టర్ బాల తన సినిమాలో హీరోలో ఉన్న యాక్టింగ్ స్కిల్ నీ… రకరకాల కోణాలలో చూపించి.. మంచి లైఫ్ ఇస్తాడు. ఈ తరహాలోనే 2003వ సంవత్సరంలో “శివపుత్రుడు” అనే సినిమాని సూర్య, విక్రమ్ లతో తెరకెక్కించి భారీ హిట్ అందుకున్నాడు. సినిమాలో విక్రమ్ యాక్టింగ్.. నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కనీసం ఎటువంటి డైలాగులు చెప్పకుండానే విక్రమ్ తన హావభావాలతో “శివపుత్రుడు” లో స్క్రీన్ చించేసాడు.
సినిమాలో సూర్య చనిపోవటం విక్రమ్ చివరిదాకా పోరాటం.. అద్భుతంగా ప్రేక్షకులను అలరించే రీతిలో డైరెక్టర్ బాల.. సినిమాను నడిపించాడు. ఆ తర్వాత సూర్య తో అనేక సినిమాలు చేయగా మధ్యలో చాలా గ్యాప్ రావడంతో మళ్లీ ఇప్పుడు.. డైరెక్టర్ బాల సూర్యతో కొత్త సినిమా పోవడం జరిగింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే సూర్య బాల సినిమాకి సంబంధించి ఒక వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే బాల సినిమాలో సూర్య డబల్ రోల్ చేస్తున్నట్లు… ఒక న్యూస్ గత కొద్ది రోజుల నుండి చక్కర్లు కొడుతుంది.
ఈ నేపథ్యంలో తాజా న్యూస్ పై సూర్య క్లారిటీ ఇచ్చాడు. సినిమాలు డబల్ రోల్ చేయటం లేదని.. అదంతా ఫేక్ న్యూస్ అని సూర్య చెప్పినట్లు తమిళ మీడియాలో.. న్యూస్ బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే బాల సినిమాకి సంబంధించిన షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయాలని సూర్య డిసైడ్ అయ్యారట. చాలా తక్కువ టైమ్ లోనే సినిమాని కంప్లీట్ చేయాలని.. కరోనా కారణంగా వచ్చిన గ్యాప్..ఫీల్ చేయాలని సూర్య సినిమా యూనిట్ కి తెలియజేసినట్లు.. జూన్ తర్వాత బాలా సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.