హీరో రామ్కు క్రికెట్ ప్రపంచ కప్ పెద్ద షాకే ఇచ్చింది. ఈయన పూరి జగన్నాథ్తో కలిసి చేసిన చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. పూరి, ఛార్మి నిర్మాతలు. ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేయడానికి ముందుగా నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అయితే క్రికెట్ ప్రపంచ కప్ దెబ్బకు సినిమాను వాయిదా వేయక తప్పడం లేదు. ఎందుకంటే జూలై 14న క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఉంది. కాబట్టి తమ సినిమాపై క్రికెట్ ప్రభావం పడుతుందని భావించిన యూనిట్ వర్గాలు సినిమాను జూలై 18న.. అంటే 6 రోజుల పాటు వాయిదా వేశారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, పాటలకు మంచి స్పందన వస్తుంది. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.
previous post
next post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!