గత సంవత్సరం క్రితం ఎక్కడో చైనాలో ఊహాన్ లోపుట్టిన కరోనా వైరస్ మెల్లమెల్లగా అన్ని ప్రపంచ దేశాలకు పాకింది. కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలోనే ఎంతో అభివృద్ధి చెందిన దేశాలలో సైతం కరోనా కేసులు, కరోనా మరణాలు అధికమవుతున్నప్పటికీ, కేవలం ఒక్క భారతదేశంలో మాత్రమే కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ, మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా నమోదయింది.
ఈ కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు సైతం పోటీపడి వాక్సిన్ కనుగొనే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలో ఎంతో జనాభా ఉన్నప్పటికీ కరోనా కేసులు తగ్గుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొదట్లో కరోనా ఇండియాలో కి వ్యాపిస్తే, భారతదేశంలో అపరిశుభ్రత ఎక్కువగా ఉండటం వల్ల, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు తెలియజేస్తారు. కానీ ప్రస్తుతం ఆ అపరిశుభ్ర తే భారతదేశాన్ని కరోనా నుంచి కాపాడిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)లోని భారతదేశ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. విదేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో పరిశుభ్రత చాలా తక్కువ ఎక్కడపడితే అక్కడ చెత్తను పారబోస్తూ ఉండడం ఇక్కడ కామన్ అయిపోవడం వల్ల కరోనా వ్యాధి వ్యాపిస్తే ఉగ్రంరూపం దాలుస్తుందని భావించారు. అయితే ప్రస్తుతం ఈ అపరిశుభ్రత ఎక్కువగా ఉండటం వల్ల భారత దేశ ప్రజలలో రోగనిరోధక శక్తి అధికంగా పెరిగిందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
భారతదేశంతో పోలిస్తే ఇతర దేశాలలో పరిశుభ్రత బాగుండి, అభివృద్ధి చెందిన దేశాలలో ఇన్ఫెక్షన్లు తగ్గినప్పటికీ అక్కడి ప్రజల్లో అలర్జీ వంటి సమస్యలు పెరిగాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది.అయితే మనదేశంలో పారిశుద్ధ్యం తక్కువగా ఉండటం వల్ల ఇంతటి వ్యాధి తీవ్రతను తట్టుకునే రోగనిరోధకశక్తి పెరిగిందని, అందువల్లే మన దేశంలో కరోనా తీవ్రత తక్కువగా ఉండి, మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉండటానికి గల కారణం కేవలం అపరిశుభ్రతేనని, శాస్త్రవేత్తలు తెలియజేశారు.