NTR : టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్నో సంచలన విజయాలను అందుకున్నారు.2 సంవత్సరాల క్రితం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతోంది.
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కావడంతో భారీ స్పందన లభించింది.ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించనున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎన్టీఆర్ నటిస్తున్న త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు అనే సమాచారం ఇది వరకు మనకు తెలిసినదే. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. మంచి పొలిటికల్ సెటైరికల్ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ ఎమోషన్ తరహాలో తెరకెక్కనున్నట్లు సమాచారం అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరంలో షూటింగ్ పనులు జరుపుకుంటుందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తర్వాత చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ తమిళ దర్శకుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా బడ్జెట్ సరాసరి ప్రభాస్ సోలార్ సినిమాకు ధీటుగా దాదాపు 300 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం ఈ సినిమాకు ఇంత మొత్తంలో ఖర్చు చేయడానికి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ తమిళ దర్శకుడు ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా గురించి అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.