తమిళ హీరో కార్తి.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మార్కెట్ ఉంది. ఈయన ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తన్నారు. అందులో ఒకటి డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై రూపొందే సినిమా. ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి `సుల్తాన్` అనే టైటిల్ను ఖరారు చేశారు. ఒకప్పుడు ఇదే టైటిల్తో బాలకృష్ణ ద్విపాత్రాభినయం, కృష్ణంరాజు, కృష్ణ నటించిన చిత్రం ప్లాప్ చిత్రంగా నిలిచింది. మరిప్పుడు కార్తి సక్సెస్ సాధిస్తాడో లేక ప్లాప్ మూటగట్టుకుంటాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
previous post
next post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!