Salaar: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “కేజిఎఫ్” రెండు భాగాలు అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. ఈ సినిమాలతో కన్నడ ఇండస్ట్రీ పేరు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మారుమ్రోగింది. మామూలుగా కన్నడ ఇండస్ట్రీ రీ చాలా చిన్నది అనే టాక్ ఉండేది. కానీ “కేజిఎఫ్” దెబ్బకి ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. “కేజిఎఫ్ 2” అయితే ఏకంగా వెయ్యి కోట్లకు పైగానే కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో “కేజిఎఫ్” బీభత్సమైన వసూలు రాబట్టడం జరిగింది.
ఈ సినిమాతో హీరో యాష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో బాహుబలి తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం రికార్డులను బ్రేక్ చేసిన ప్రభాస్ తో ఇప్పుడు ప్రశాంత్ నీల్ “సలార్” సినిమా చేయటం సంచలనం గా మారింది. సెప్టెంబర్ 28వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా నటి శ్రేయ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. “కేజిఎఫ్” కు మించి “సలార్” ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది. ఇటువంటి సినిమా ఇప్పటివరకు చూసుండాం. ఈ సినిమా కోసం గేమ్ ఆఫ్ త్రోన్స్ లాగా ఓ ప్రపంచమే సృష్టించటం జరిగింది.
అందులోనూ ప్రభాస్ క్యారెక్టర్ ను ఎప్పుడూ చూసి ఉండరు. సినిమాలో ప్రభాస్ అదేవిధంగా పృథ్వీరాజ్ పాత్రలు నెక్స్ట్ లెవెల్ మాదిరిగా ఉంటాయి. దీంతో నటి శ్రేయ రెడ్డి చేసిన కామెంట్స్ తో సలార్ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ప్రభాస్ ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకోవడం జరిగింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇటీవల వచ్చిన “ఆదిపురుష్” కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ సలార్ పైనే పెట్టుకోవడం జరిగింది.