Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ పడాల్సిందే. అటువంటిది వీరిద్దరి దగ్గరికి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా స్టోరీ రావడం జరిగిందట. కానీ వీరిద్దరూ అది మిస్ చేసుకోగా చివరాకరికి వరుణ్ తేజ్ ఆ చాన్స్ అందుకుని బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడం జరిగిందట.
విషయంలోకి వెళితే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో పాటు సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఫిదా సినిమా… స్టోరీ మొట్టమొదటిసారిగా మహేష్ బాబు కి శేఖర్ కమ్ముల వినిపించడం జరిగింది. మహేష్ రిజెక్ట్ చేయటంతో తరువాత రామ్ చరణ్ తేజ్ కి శేఖర్ కమ్ముల చెప్పడం జరిగిందని ఆయన కూడా..
రిజెక్ట్ చేయటంతో చివరాకరికి వరుణ్ తేజ్ కి అవకాశం దక్కడంతో సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యిందని తాజాగా శేఖర్ కమ్ముల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల “లవ్ స్టోరీ” సినిమా చేస్తున్నారు. నాగచైతన్య… సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయింది. ఇటీవల రిలీజ్ కావాల్సి ఉండగా తాజాగా పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శేఖర్కమ్ముల పాల్గొన్న సమయంలో ఈ విషయాన్ని బయటపెట్టారు. విషయం బయటపడటంతో మహేష్ మరియు చరణ్ అభిమానులు ఓ మంచి ఛాన్స్ మిస్సయిందే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.