Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ కలిగిన హీరోలలో ముందు వరుసలో ఉంటారు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోలు ఉన్నాగాని ఈ ఇద్దరికీ సంబంధించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ స్టార్ట్ అయి రికార్డుల మోత మోగుతూనే ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది హీరోలు మల్టీస్టారర్ సినిమా చేస్తూ ఉన్నారు. అయితే వీరిద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే చాలా బాగుంటుందని ఎప్పటినుండో అనేక మంది హీరోలు అభిమానులు కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్.. మళ్లీ సినిమాల విషయంలో స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే “వకీల్ సాబ్” సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి మంచి కలెక్షన్లు సాధించిన పవన్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను.. లైన్ లో పెడుతూ ఉన్నారు. కరోనా నేపథ్యంలో షూటింగ్ పూర్తిగా ఆపేసిన పవన్ ప్రస్తుతం వర్కింగ్ చేస్తున్న సినిమాలు లిస్టు చూస్తే రానా తో మల్టీస్టారర్… క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు… ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో.. మరో సినిమా అధికారికంగా పవన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
చాలా వరకు లిస్ట్ చూస్తే పవన్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్లను..లైన్ లో పెడుతూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ని.. లైన్ లో పెట్టడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కి మహర్షి సినిమా తో అదిరిపోయే విజయాన్ని అందించిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి తాజాగా పవన్ కి స్టోరీ నేరేట్ చేసినట్లు.. అంతా ఓకే అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిలిం వర్గాలలో టాక్ నడుస్తోంది. మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో వంశీపైడిపల్లి.. స్క్రిప్టు ఉన్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో.. ఈ ప్రాజెక్టు ఓకే అయితే బాగుంటుంది అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్లు టాక్.