Chiranjeevi- Surekha : టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద కుటుంబాలలో మెగా కుటుంబం ఒకటి. ఇప్పటికే ఇండస్ట్రీలో ఈ కుటుంబం నుంచి ఎంతో మంది యువ హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ కుటుంబం గురించి పలువురు ఎన్నోసార్లు విమర్శించిన తామంతా ఒక్కటేనంటూ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఈ కుటుంబంపై ఎలాంటి విమర్శలు రాకుండా చూసుకుంటారు. ఈ మెగా కుటుంబం ఇన్ని సంవత్సరాలుగా కలిసిమెలిసి ఎంతో ఆప్యాయంగా ఉండటానికి గల కారణం మెగాస్టార్ సతీమణి సురేఖ కారణమని తాజాగా నాగ బాబు తెలియజేశారు.
ఫిబ్రవరి 20 చిరంజీవి, సురేఖ గారి 42 వ పెళ్లిరోజు కావడంతో ఈ సందర్భంగా నాగబాబు తన అన్న, వదినలకు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేస్తూ తన వదిన పై ప్రశంసల వర్షం కురిపించారు. “కుటుంబమంతా ఈ విధంగా కలిసి ఉండడానికి గల కారణం మీరే వదినమ్మ.. కొణిదెల సామ్రాజ్య తండ్రి, తల్లి కి పెళ్లిరోజు శుభాకాంక్షలు” అంటూ నాగబాబు ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా నాగబాబు చిరంజీవి దంపతులు, నాగబాబు దంపతులు, పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోను కూడా సోషల్ మీడియా వేదికగా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున మెగాస్టార్ చిరంజీవి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తాను ఈ రోజు ఈ విధంగా ఉండటానికి కారణం మీరే:
చిరంజీవి దంపతులు పెళ్లి రోజు కావడంతో మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్ తనదైన శైలిలో స్పందించి తన తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.”నా జీవితంలో అత్యంత విలువైనది మీరే..తాను ఈ రోజు ఇలా ఉండటానికి కారణం మీరే.. నా జీవితం మీదే “అంటూ రామ్ చరణ్ ఎమోషన్ అవుతూ తల్లిదండ్రులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ ఫోర్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న సోహైల్ చిరంజీవి, సురేఖ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!