సీనియర్ నటుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేత మంచు మోహన్ బాబు నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఫీజు రియంబర్స్మెంట్ పథకం క్రింద ప్రభుత్వం నగదు చెల్లించలేదని ధర్నా చేసిన మోహన్బాబు.. ప్రభుత్వాన్ని దయ్యబట్టాడు. దీంతో ఇది వరకు వై.ఎస్. కుటుంబంతో మోహన్బాబుకు ఉన్న బంధుత్వం రీత్యా ఆయన వైఎస్ఆర్పిలో చేరతారనే వార్తలు వినిపించాయి. పలు సందర్భాల్లో వీలున్న ప్రతిసారి మోహన్బాబు జగన్తో బేటీ అవుతూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మోహన్బాబు , జగన్ బేటి ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి మోహన్బాబు వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరుతారా? లేక మద్దతుని బయటి నుండే తెలియజేస్తారా? అని తెలియాల్సి ఉంది.
previous post
next post