`స్వామిరారా`,` కార్తికేయ` తరహాలో మరో సాలిడ్ హిట్ కోసం నిఖిల్ బలంగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ యువ కథానాయకుడు ఇప్పుడు హ్యూజ్ హిట్ కోసం తమిళ చిత్రం `కణితన్`ను తెలుగులో `అర్జున్ సురవరం` పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏ ముహుర్తాన మొదలెట్టారో కానీ.. సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. ఇప్పుడు కూడా సినిమా మరోసారి వాయిదా పడింది. సినిమాను మార్చి 29న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఎన్నికల ఎఫెక్ట్ పడుతుందేమోనని నిర్మాతలు భావించి.. పోస్ట్పోన్ చేస్తున్నారట. సినిమాను ఏప్రిల్లో విడుదల చేయలేరు. ఎందుకంటే ఇప్పటికే ఏప్రిల్ నెలంతా సినిమాలు రిలీజ్లతో బుక్ అయిపోయాయి. కాబట్టి సినిమాను మే 1న విడుదల చేయాలనుకుంటున్నారని వార్తలు వినపడుతున్నాయి. త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుంది.
previous post
next post