నితిన్, కీర్తిసురేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `రంగ్ దే`. విజయ దశమి సందర్భంగా ఈ సినిమా ప్రారంభమైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకుడు. నితిన్, కీర్తి సురేశ్లపై త్రివిక్రమ్ క్లాప్ కొట్టగా, ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి మహేంద్ర కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దిల్రాజు, చినబాబు స్క్రిప్ట్ను అందించారు.
ఈ సందర్భంగా వెంకీ అట్లూరి మాట్లాడుతూ “ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి 2020 వేసవి కానుకగా సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
previous post
next post
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!