అనువుగాని చోట అధికులమని అనరాదు అని వేమన అప్పుడెప్పుడో చెప్పాడు. ఆ మాట ఎప్పుడో చెప్పిందే అయినా, ఇప్పటికీ అది వర్తిస్తుంది. ఈ విషయం ఇప్పుడు ఎవరికి అంతుబట్టిందో లేదోగానీ నివేదాకు మాత్రం చక్కగా అర్థమైంది. ఇంతకీ నివేదా ఏం చేసిందని అనుకుంటున్నారా… అక్కడికే వస్తున్నాం. నివేదా పెతురాజ్ తాజాగా సాయిధరమ్తేజ్ పక్కన `చిత్రలహరి`లో నటించింది. ఏప్రిల్ 12న విడుదల కానుందీ సినిమా. ఇటీవల నివేదా తన స్నేహితురాలితో కలిసి మధురై మీనాక్షి ఆలయానికి వెళ్లారు. ఆలయ ప్రాంగణంలో తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు. మామూలుగా ఆలయంలోకి ఎవరినీ సెల్ఫోన్లు తీసుకెళ్లనివ్వరు. భద్రత దృష్ట్యా ఆలయ నిర్వాహకులు సెల్ఫోన్లను నిషేదించారు. ఆలయంలోనే ఒకచోట అందరూ వాటిని పెట్టి లోపలికి వెళ్లాలి. అలాంటిది నివేదా మాత్రం లోపలికి సెల్ఫోన్లను ఎందుకు తీసుకెళ్లారు అని ట్రోల్ చేస్తున్నారు.
previous post
next post