యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్నభారీ మల్టీస్టారర్ `RRR`. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణను జరుపుకుంటోంది. రీసెంట్గా ఎన్టీఆర్పై బల్గేరియాలో షెడ్యూల్ను పూర్తి చేశారు. త్వరలోనే హైదరాబాద్లో చరణ్కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని సమాచారం. కాగా ఈ సినిమాకు సంబంధించిన వార్తొకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే..ఈ సినిమాలో కేవలం మూడు పాటలే ఉంటాయట. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వీటితో బ్యాగ్రౌండ్ మ్యూజిక్తో సాగే మరో పాట ఉంటుందట. వచ్చే ఏడాది జూలై 30న సినిమాను విడుదల చేస్తానని రాజమౌళి ప్రకటించారు. కాబట్టి ఆయన వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
previous post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!