Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. కృష్ణం రాజు, జగపతిబాబు, భాగ్యశ్రీ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ప్యూర్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు సంయుక్తంగా నిర్మించారు.
ఈ పాన్ ఇండియా చిత్రం ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. కరోనా, ఇతర కారణాల వల్ల బాగా ఆలస్యం అయింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న మేకర్స్ గ్రాండ్గా విడుదల చేయాలనుకున్నారు. కానీ, ఇంతలోనే కరోనా దెబ్బకు మరోసారి వాయిదా పడింది. ఇకపోతే గతంలో మాదిరిగానే మళ్లీ ఈ సినిమా ఓటీటీలోకి వెళ్లబోతోందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
నిజానికి ఇప్పటికే దర్శకనిర్మాతలు రాధేశ్యామ్ సినిమా ఓటీటీలో వచ్చే ప్రసక్తే లేదని.. ఖచ్చితంగా థియేటర్స్లోని రిలీజ్ అవుతుందని ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ, తాజాగా ఈ సినిమాకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ డైరెక్ట్ రిలీజ్ కోసం ఏకంగా రూ.350 కోట్లను ఆఫర్ చేసిందట. ఇది ఇండియాలోనే ఆల్ టైం బిగ్గెస్ట్ డైరెక్ట్ రిలీజ్ రేటు అనే చెప్పాలి.
ఈ నేపథ్యంలోనే అస్సలు ఊహించని అద్భుతమైన ఆఫర్ రావడంతో ఓటీటీ రిలీజ్కు దర్శక, నిర్మాతలు ఇంట్రస్ట్ చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపైన ప్రభాస్ సైతం ఆలోచిస్తున్నాడని టాక్. మరి ఒకవేళ ఈ ప్రచారం నిజమై ప్రభాస్ పొరపాటున ఓటీటీ రిలీజ్కి ఓకే చెబితే ఆయన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. ఎందుకంటే, రాధేశ్యామ్ను థియేటర్స్లో చూడాలని అభిమానులు ఎంతగానో ఆరాటపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓటీటీ రిలీజ్ అని ప్రకటన వస్తే వాళ్లు అస్సలు సహించలేరు.