‘RRR’: పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ గురించే అందరి చూపు ఉంది. ఇప్పటికే అన్నీ చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. కానీ అక్కడ మాత్రం బుకింగ్స్ విషయంలో రాజమౌళికి షాక్ తగిలేట్టుగా ఉందట. సినిమా రిజల్ట్ తేడా కొడితే బ్రేకీవెన్ టార్గెట్ రీచ్ కాదట..? ఇదే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక అమెరికాలో ఎప్పుడో బుకింగ్స్ విషయంలోనే రికార్డ్ నమోదైంది.
చరణ్-తారక్- రాజమౌళి త్రయం ఇమేజ్ ఆ మూడు చోట్లా అసాధారణంగా కనిపించింది. ఇక కర్ణాటకలోనూ బాగానే ఉంది. ఎన్టీఆర్ క్రేజ్ వల్ల అక్కడ కూడా టిక్కెట్లు బాగానే అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటుంది కోలీవుడ్ గురించి. తమిళనాడులో అంతగా జోరు కనిపించడం లేదు. సాధారణంగానే తెలుగు సినిమాలకు క్రేజ్ పెద్దగా కనిపించదు. ‘బాహుబలి-2’ రిలీజ్ సమయంలోనూ కూడా బుకింగ్స్ పరంగా ఇదే సీన్ కనిపించింది.
‘RRR’: రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా నెగిటివ్ కామెంట్స్..!
ఇక కేరళ రాష్ర్టంలో కూడా తమిళనాడు కన్నా పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నీరసంగా ఉన్నాయట. రూ.10 కోట్లకు కేరళ రాష్ట్రంలో రైట్స్ దక్కించుకున్నారు. అంటే అక్కడ కనీసం రూ.12 కోట్లు రాబట్టాలి. అప్పుడే బ్రేకీవెన్ టార్గెట్ రీచ్ అవుతుంది. ఇదంతా సినిమా రిలీజయ్యాక టాక్ను బట్టి ఉంటుంది. పొరపాటున సినిమాకు గనక నెగిటివ్ వస్తే అంత మొత్తం రాబట్టడం కష్ఠమే అంటున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా టికెట్ రేట్స్ మరీ ఎక్కువగా పెంచడం వల్ల నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.