కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. ఇటు తెలుగు, అటు తమిళంలో వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండతో రష్మిక నటించిన `డియర్ కామ్రేడ్` మే నెలలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే నితిన్ `భీష్మ` చిత్రంలో నటించనుంది. కాగా తాజా సమాచారం ప్రకారం మరో క్రేజీ ప్రాజెక్ట్ లో రష్మిక నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో అల్లు అర్జున్, సుకుమార్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాను తీసుకున్నారు. ఈ విషయాన్ని రష్మికే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!