Rashmika Mandanna: మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో టాప్ ప్లేస్లో ఉంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధిస్తుండటంతో మేకర్స్లో ఆమె మీద దృష్ఠి బాగా పడింది. అందుకే, ఇండస్ట్రీలలో ఏ కొత్త ప్రాజెక్ట్ మొదలైనా కూడా ముందు రష్మిక పేరునే పరిశీలిస్తున్నారు. తన డేట్స్ కుదరక పోతే గానీ, ఆ తర్వాత ఇంకో హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి 10 ప్రాజెక్ట్స్ వదులుకుందట. వాటిలో ఆచార్య, మాస్టర్, బీస్ట్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.
ఇక తనకు ఏమాత్రం డేట్స్ సర్దుబాటు అయినా ప్రాజెక్ట్ను వదలడం లేదు. పాన్ ఇండియన్ సినిమాగా వచ్చిన పుష్ప సక్సెస్తో సౌత్ సినిమా ఇండస్ట్రీలలో రష్మిక క్రేజ్ మరింతగా పెరిగింది. బాలీవుడ్లో రెండు సినిమాలు రిలీజ్ కాబోతుండగా కొత్తగా మూడు సినిమాలు చేస్తోంది. ఇక తెలుగులో పుష్ప సీక్వెల్ మూవీతో పాటు స్వప్న సినిమా నిర్మించే సీతారామం, విజయ్ సరసన దిల్ రాజు నిర్మాణంలో వంశీపైడిపల్లి తెరకెక్కించబోతున్న పాన్ ఇండియన్ సినిమాలను కమిటైంది. ఈ రెండు చిత్రాల అధికారిక ప్రకటన ఇటీవల ఆమె బర్త్ డే సందర్భంగా వచ్చింది.
Rashmika Mandanna: ఈ చిత్రానికి దర్శకుడెవరో త్వరలో వెల్లడి..
ఈ క్రమంలో ఇప్పుడు మరో అగ్ర నిర్మాణ సంస్థ అయిన జీఏ2లో రష్మిక మందన్న నటించేందుకు కొత్తగా కమిటైందట. ఇప్పటికే, ఈ నిర్మాణ సంస్థ నుంచి నాని హీరోగా ‘భలే భలే మగాడివోయ్’, విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ – ‘టాక్సీవాలా’, సాయి ధరమ్ తేజ్తో ‘ప్రతిరోజు పండగే’ అఖిల్ అక్కినేనితో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కూడా కొన్ని క్రేజీ చిత్రాలను నిర్మిస్తోంది ఈ సంస్థ. గీతా ఆర్ట్స్ సంస్థను అనుబంధంగా చిత్రాలు నిర్మిస్తున్న ఇందులో భారీ బడ్జెట్ కేటాయించి రష్మిక మందన్నతో ఓ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది కూడా. మరి ఈ చిత్రానికి దర్శకుడెవరో త్వరలో వెల్లడి కానుందని సమాచారం.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!