Tiger Nageswara Rao: 2006వ సంవత్సరంలో ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన “విక్రమార్కుడు” సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో రవితేజ డబల్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకులను అద్భుతంగా మెప్పించడం జరిగింది. బ్రహ్మానందంతో కామెడీ సీన్స్ పోలీస్ క్యారెక్టర్ లో రవితేజ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం “విక్రమార్కుడు” సినిమాకి సీక్వెల్ రాబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా రవితేజ కొత్త సినిమా “టైగర్ నాగేశ్వరరావు” ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న రవితేజ “విక్రమార్కుడు” సీక్వెల్ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మరో కామెడీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
ఈ సినిమాలో బ్రహ్మానందం నాతోపాటు నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సైన్స్ ఫిక్షన్ స్టోరీలో మరో సినిమా చేయబోతున్నాను. ఇక “విక్రమార్కుడు” సీక్వెల్ గురించి రాజమౌళి నాతో ఎలాంటి చర్చ జరపలేదు. కానీ ఈ సినిమా రెండో పార్ట్ రాబోతుందంటూ వార్తలు వచ్చాయి. నిజంగా రాజమౌళితో పని చేసే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. నేను కూడా అంతే అంటూ సీక్వెల్ ఎప్పుడైనా తాను రెడీ అన్నట్లు రవితేజ స్పష్టం చేశారు. అంతేకాకుండా యాక్షన్, డ్రామా, ఎమోషన్ కథలలో నటించినప్పటికీ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచడమే తన అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇక ఇదే సమయంలో తన బయోపిక్ వస్తే మాత్రం దానికి మాస్ మహారాజా అనే టైటిల్ అయితే బాగుంటుందని అన్నారు. డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా అక్టోబర్ 19 వ తారీకు విడుదల కాబోతోంది. “టైగర్ నాగేశ్వరరావు” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ దర్శకుడు కథకుడు వి విజయేంద్రప్రసాద్ నేషనల్ టూరిజం మినిస్టర్ జి.కిషన్ రెడ్డి అలానే వీటితోపాటు టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ హరిష్ శంకర్, హసిత్ గోలి, గోపీచంద్ మలినేని, చందు మొండేటి రాబోతున్నారు.