IND vs PAK: ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు అదరగొట్టారు. టీమిండియా బౌలర్ల ధాటికి పాక్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణయం సరైందని రుజువైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్ లో బాబర్ అజమ్, రిజ్వాన్ ల బ్యాటింగ్ ను మాత్రమే నమ్ముకున్న పాకిస్థాన్ టీమ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 24 బంతుల్లో 20 పరుగుల చేసి అవుట్ అవ్వగా.. ఇమామ్ ఉల్ హక్ 36 పరుగులు చేశాడు. కెప్టెన్ బాబర్ అజమ్ 50 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత రిజ్వాన్ 49 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత ఎవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ కు తప్ప బౌలింగ్ వేసిన మిగిలిన అయిదుగురు బౌలర్లు రెండేసి వికెట్లు పడ్డాయి. రెండు వికెట్ల నష్టానికి 155 పరుగులతో ఒకానొక దశలో పటిష్ట స్థితిలో కనిపించిన పాక్ జట్టు ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. 42.5 ఓవర్లకు 191 పరుగులు మాత్రమే చేయగలిగింది పాక్ జట్టు.
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో ఒకే ఓవర్ లో రెండు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ ను చావుదెబ్బ కొడ్డాడు. పాకిస్తాన్ ఇన్సింగ్స్ 33 ఓవర్ లో రెండో బంతికి సౌద్ షకీల్ ను ఎల్బీ రూపంలో పెవిలియన్ కు పంపిన కుల్దీప్ .. అదే ఓవర్ లో అఖరి బంతికి ఇఫ్తికర్ అహ్మద్ క్లీన్ బౌల్డయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మ్యచ్ లో కుల్దీప్ తన పది ఓవర్ల కోటాలో కేవలం 35 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. భారత బౌలర్లలో కుల్దీప్, సిరాజ్, బుమ్రా, హార్ధిక్, జడేజా తలా రెండు వికెట్లతో చెలరేగారు.
KTR: మాజీ మంత్రి పొన్నాలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మంత్రి కేటిఆర్