“బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RRR” సినిమాపై దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అంచనాలు భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం యంగ్ టైగర్ ఎన్టీఆర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి ఈ సినిమా చేస్తున్న నేపథ్యంలో సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ లో అందరి చూపు “RRR” పైన పడింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా అలియా భట్ – ఒలీవియా మోరిస్ లు నటిస్తున్నారు.
కాగా కరోనా వైరస్ తరువాత లాక్ డౌన్ దెబ్బకి మొన్నటి వరకు షూటింగ్ ఆగిపోగా తాజాగా తిరిగి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినిమాకి సంబంధించి క్లైమాక్స్ సన్నివేశం చిత్రీకరిస్తున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఈమేరకు ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇద్దరు చేతులను కలిపి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసారు. ఇకపోతే ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ స్పెషల్ టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఫిలిం వర్గాలలో టాక్ నడుస్తోంది.
ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రేయ, సముద్రఖని ఇంకా చాలా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. డివివి దానయ్య బ్యానర్ లో భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా సినిమాగా “RRR” తెరకెక్కుతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న క్లైమాక్స్ సీన్ హై టెక్నికల్ కెమెరాలతో సినిమా యూనిట్ చిత్రీకరిస్తున్నట్లు.. విజువలైజేషన్ అదరగొట్టే రీతిలో ఉండే విధంగా రాజమౌళి ప్రతి సన్నివేశం ఆడియెన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉండే రీతిలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ సినిమా తెరకెక్కించడం కోసం చాలా టైం తీసుకోవడంతో ప్రతి సీన్ థియేటర్లో చూసే ప్రేక్షకుడికి గుర్తుండిపోయే విధంగా రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాహుబలి తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలని మంచి కసి మీద ఉన్నారట.