Radhe shyam: అనవసరంగా ప్రభాస్ సినిమా ఒప్పుకున్నా..ఇప్పుడు బాధపడుతున్న సీనియర్ హీరోయిన్..? అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా పీరియాడికల్ లవ్ స్టోరీగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందనే కామెంట్స్ రిలీజైన మొదటి రోజు నుంచి వినిపిస్తున్నాయి. ఇక ‘రాధేశ్యామ్’ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ వసూళ్లను సొంతం చేసుకుంటుందనే గట్టి నమ్మకంతో మేకర్స్, ట్రేడ్ వర్గాల వారు ఉన్నారు. కానీ, బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బోల్తా పడింది.
దాంతో బాలీవుడ్ మీడియాలో ‘రాధేశ్యామ్’ సినిమాపై నెగటివ్ కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి. ఇదే సమయంలో ఇందులో నటించిన మైనే ప్యార్కియా హీరోయిన్ భాగ్య శ్రీ గురించి చర్చ కూడా సాగుతోంది. భాగ్యశ్రీ సినిమాలో ఉండడం వల్ల గ్యారెంటీగా హిందీ ప్రేక్షకులు ఈ చిత్రంపై విపరీతమైన ఆసక్తిను చూపిస్తారని మేకర్స్ భావించారు. అందుకే, చాలా ఏళ్ళ తర్వాత ఆమెను ఒప్పించి మరీ కీలక పాత్రలో నటింపజేశారు. ఇందుకోసం భాగ్యశ్రీకి రెమ్యునరేషన్ కూడా భారీగానే ఇచ్చినట్టు తెలుస్తోంది.
Radhe shyam: వారి విషయంలో ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.
ఇక భాగ్యశ్రీ ఈ మూవీలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించారు. ఆమెకు బాలీవుడ్ ప్రేక్షకుల్లో మాత్రమే కాకుండా టాలీవుడ్లోను మంచి క్రేజ్ ఉంది. హిందీలో ఆమె చేసింది కొన్ని సినిమాలే. అయినా కథ, మంచి పాత్రలను ఎంపిక చేసుకుని మరీ పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే, దేశ వ్యాప్తంగా పాపులారిటీని తెచ్చుకున్న భాగ్యశ్రీకి ‘రాధేశ్యామ్’ సినిమాలో మాత్రం ఆమెకు అంత ఇంపార్టెన్స్ ఉన్న రోల్ దక్కలేదని చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభాస్ అభిమానులు కూడా ఏకీభవిస్తున్నారు. లోలోపల భాగ్యశ్రీ కూడా అనవసరంగా ప్రభాస్ సినిమాను ఒప్పుకొని పొరపాటు చేశానని ఫీలవుతుందట. ఒక్క భాగ్యశ్రీ మాత్రమే కాదు ఇందులో కీలక పాత్రల్లో కనిపించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు, సత్యరాజ్, జగపతిబాబులకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలు దక్కలేదు. వారి విషయంలో ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.