Salaar: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమాలలో సలార్ ఒకటి. అసలు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదు. కేజీఎఫ్ ఛాప్టర్ 1 సక్సెస్ తర్వాత అదే కాంబినేషన్లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రకటించారు. షూటింగ్ కూడా నాన్ స్టాప్గా జరిపారు. అదే సమయంలో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్తో చేయనున్నాడని..ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇది భారీ యాక్షన్ సినిమా అని టాక్ వినిపించింది.
కానీ, అనూహ్యంగా ప్రభాస్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ను కేజీఎఫ్ సిరీస్ నిర్మాతలు ప్రకటించి అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ సినిమా మొదలైనప్పటి నుంచి షూటింగ్ అప్డేట్స్ కూడా మేకర్స్ పెద్దగా ఇవ్వలేదు. రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలకు సంబంధించిన అప్డేట్సే వచ్చాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించి పోస్టర్, టీజర్, రిలీజ్ డేట్ వంటి విషయాలకు సంబంధించి ఆయా చిత్ర దర్శక, నిర్మాతలు ఇచ్చారు. ఇప్పటికే పీరియాడికల్ రొమాంటిక్ లవ్స్టోరిగా రూపొందిన పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్ రిలీజ్కు రెడీగా ఉంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు రాధకృష్ణ దర్శకత్వం వహించాడు. జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Salaar: లాంగ్ షెడ్యూల్తో సలార్ మొత్తం షూటింగ్ కంప్లీట్..!
ఇక ఆదిపురుష్ సినిమా షూటింగ్ను ప్రభాస్ ఎప్పుడో పూర్తి చేశారు. ఇది పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది. 2022, ఆగస్ట్ 11న రిలీజ్ అని అధికారికంగా తేదీని ప్రకటించారు. కానీ, సర్ప్రైజింగ్గా సలార్ షూటింగ్ కూడా దాదాపు ప్రభాస్ పూర్తి చేశాడట. ఓ లాంగ్ షెడ్యూల్తో సలార్ మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుందని లేటెస్ట్ న్యూస్. జనవరిలో ఈ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఆ తర్వాత పూర్తిగా ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ కోసం బల్క్ డేట్ కేటాయించనున్నారు ప్రభాస్. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్తో దీనిని నిర్మిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణ్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు.