బాహుబలితో పాన్ ఇండియా స్టార్ ఎదిగిన ప్రభాస్కు మరో విశిష్ట గుర్తింపు లభించింది. బ్రిటన్కు సంబందించిన ఈస్ట్రన్ ఐ న్యూస్ పేపర్ విడుదల చేసిన టాప్ 50 ఆసియన్ సెలెబ్రెటీ జాబితాలోని టాప్ 10 లిస్ట్లో డార్లింగ్ ప్రభాస్ 7వ స్థానంలో నిలిచాడు. రాబోయే ఆదిపురుష్, సలార్ చిత్రాలతో ప్రభాస్ దేశంలోనే అగ్ర హీరోల జాబితాలో చేరుతాడు అనడంలో కూడా సందేహం లేదు. తెలుగు ఇండస్ట్రీ నుండి ఒక్క ప్రభాస్కు మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది.
కరోనా కాలంలో పేదలకు అండగా నిలిచిన, వలస కార్మికులను సొంత ఇళ్లకు చేర్చి, ఎందరో పేదలను ఆదుకున్న సోనూసూద్ మొదటి స్థానంలో నిలవగా, ఇండియన్ సింగర్ అర్మాన్ మాలిక్ 5వ స్థానంలో నిలిచాడు. 6వ స్థానంలో బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా మోస్ట్ ఫేమస్ ఇండియన్ యాక్టర్ అఫ్ ది ప్లానెట్గా కొనసాగుతుంది. ప్రియాంక చోప్రా మన దేశానికి జవాన్ ఎంత ముఖ్యమో రైతులు కూడా అంతే ముఖ్యం, వారి విలువలు కాపాడండి అంటూ రైతుల ఆందోళన గురించి ట్విట్టర్ వేదికగా స్పందించింది.
ఈ ఎంపికలో ప్రధానంగా కరోనా కాలంలో సోషల్ యాక్టివిటీస్, సినిమా రంగం, మ్యూజిక్, సాహిత్యం పలు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ జాబితా విడుదల చేసినట్టు తెలుస్తుంది. మొదటి స్థానంలో నిలిచిన సోనుసూద్ తన ప్రయత్నాలను పరిగణలోకి తీసుకొని అత్యుత్తమ స్థాయిలో తనను కుర్చోపెట్టారని, నేనొక సాధారణ మనిషిలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించనని నన్ను గుర్తించినందుకు ధన్యవాదములు తెలిపారు. తాను సాయం చేసిన వారి ఆశిష్షులు, వారి ప్రార్థనల వల్లే తనకు ఈ గౌరవం దక్కిందని నా చివరి శ్వాస వరకు ఈ సేవ కార్యక్రమాలను అపానని సోనుసూద్ తెలిపాడు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!