మెగాస్టార్ చిరంజీవి తనయురాలు శ్రీజ మనందరికీ సుపరిచితమే. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనప్పటికీ ఈమె వ్యక్తిగత విషయాలలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఈమె ఆ వ్యక్తితో విడిపోయి మరోసారి మెగా ఇంటి గుమ్మం తొక్కింది. దీంతో మెగాస్టార్ తన కూతురి కాపురాన్ని సరిదిద్దాలని కళ్యాణ్ దేవ్ తో వివాహం జరిపించాడు.
ఇక ఈ ముద్దుగుమ్మ కి మొదటి భర్తతో ఓ కూతురు పుట్టింది. ఇక అనంతరం రెండో భర్తతో కూడా ఓ పాప పుట్టింది. ఇక అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో శ్రీజ మెగా ఇంటికి పరిమితమైంది. ఇక దీంతో వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుని విడిపోతున్నారంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో షికారు చేశాయి. దీనిపై అధికారిక ప్రకటన కింద పలు పోస్ట్ లు ద్వారా అనౌన్స్ చేశాడు కళ్యాణ్ దేవ్. ఇక గత కొంతకాలంగా శ్రీజ తన ఇద్దరి కూతుర్లతో మెగాస్టార్ ఇంట్లోనే ఉంటుంది.
ఇక దీంతో ప్రతి ఒక్కరూ వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారని నమ్మారు. ఇక ప్రస్తుతం శ్రీజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలుచేసింది. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ..” మెగా ఫ్యామిలీలో పుట్టినప్పటికీ ప్రస్తుతం ఒంటరిగానే బ్రతుకుతున్నాను. నేను విడాకులు తీసుకున్నప్పుడు చాలామంది చాలా మాటలు అన్నారు. నన్ను, నా కుటుంబాన్ని బ్లేమ్ చేశారు. అది చూసి ఎంతో ఏడ్చాను. మానసికంగా కృంగిపోయాను.
సాధారణంగా ఎవరైనా మరొకరిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆచితూచి ఆలోచించాలి. వారు మన ఇంట్లో వారిలాగా కేరింగ్ తీసుకుంటారో లేదో ఆలోచించాలి. మా చిరంజీవికి నేనంటే ప్రాణం. అలానే మా డాడీ అంటే కూడా నాకు చాలా ఇష్టం ” అంటూ చెప్పుకొచ్చింది. ఇక అధికారికంగా ప్రకటించకపోయిన తాను, కళ్యాణ్ దేవ్ విడివిడిగా ఉంటున్నారని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!