Guntur Kaaram: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న “గుంటూరు కారం” సంక్రాంతి పండుగ కానుకగా జనవరి నెలలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ గత కొద్ది నెలల నుండి సరవేగంగా జరుగుతుంది. డిసెంబర్ 20 కల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం కేరళలో సాంగ్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో మహేష్ మరియు శ్రీలీల పాల్గొనడం జరిగింది. కేరళ షెడ్యూల్ అయిన వెంటనే సినిమాలో చిన్నపాటి బ్యాలెన్స్ సన్నివేశాలు కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలు జరగనున్నట్లు సమాచారం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఇటీవల ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన మీనాక్షి చౌదరి.. “గుంటూరు కారం” సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో మహేష్ బాబు గురించి మాట్లాడుతూ ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని అన్నారు. సినిమా షూటింగ్ సెట్ లో మహేష్ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ మాట్లాడతారని స్పష్టం చేశారు. “గుంటూరు కారం” సినిమా సెట్ లోకి వచ్చిన మొదటి రోజు చాలా టెన్షన్ పడటం జరిగింది. ఆ సమయంలో ఫస్ట్ షాట్ మహేష్ బాబుతో చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితులలో నేను చాలా టెన్షన్ పడుతూ ఉండటం గమనించిన మహేష్ పర్లేదు టైం తీసుకోండి టెన్షన్ పడొద్దు అంటూ.. నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. మహేష్ ఫ్యామిలీ పర్సన్. ఆయనతో వర్క్ చేయడం చాలా సరదాగా అనిపించింది. అభిమానులందరూ మహేష్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని తెలుసు.
కచ్చితంగా లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ నటించిన ఈ సినిమా అభిమానులకు నచ్చేటట్టు ఉంటుంది అని మీనాక్షి చౌదరి వెల్లడించారు. ఇదిలా ఉండే గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా రెండు సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. థియేటర్ లలో ఈ సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకోకపోయినా గానీ టెలివిజన్ రంగంలో మాత్రం టీఆర్పీ రేటింగ్ లలో అద్భుతాలు సృష్టించాయి. సో మళ్లీ దాదాపు పుష్కరకాలం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ మూడో సినిమా “గుంటూరు కారం” పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. పైగా ఈ సినిమాలో మహేష్ పూర్తిగా మాస్ తరహాలో కనిపిస్తూ ఉండటంతో.. రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.