సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ క్రేజీ కాంబినేషన్ లో త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోయో తాజా చిత్రం సర్కారు వారి పాట. జీ.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైనప్పటి నుంచి హీరోయిన్ విషయం లో రక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా ఎవరు చేస్తారు అన్నది యూనిట్ ఇంకా సస్పెన్స్ గా ఉంచింది.
సర్కారు వారి పాట టైటిల్ ఫస్ట్ లుక్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కియారా అద్వానీ పేరు గట్టిగా వినిపించింది. తర్వాత బాలీవుడ్ నటుడుమహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ నటిస్తుందన్న వార్త వినిపించింది. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పేరు తెర మీదకి వచ్చింది. అయితే ఏ హీరోయిన్ ని ఫైనల్ చేశారన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కి విలన్ గా కన్నడ స్టార్ హీరో కిచ్చ సుధీప్ నటిస్తున్నట్లు తాజా సమాచారం. కథలో కీలకమైన విలన్ పాత్రకు సుధీప్ పర్ఫెక్ట్ అని పరశురామ్ ని ఎంచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈగ లో సుదీప్ తన విలనిజాన్ని ఎంతగా చూపించాడో అందరికి తెలిసిందే. ఆ తర్వాత బాహుబలి లోను అదే రేంజ్ లో అదరగొట్టాడు. మరి సర్కారు వారి పాట లో గనక సుదీప్ నటిస్తే ఆసక్తిగానే ఉంటుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో చూడాలి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!