వరుణ్తేజ్, అధర్వమురళి, పూజా హెగ్డే, మృణాళిని రవి ప్రధాన పాత్ర ధారులుగా రూపొందుతోన్న చిత్రం `వాల్మీకి`. హరీశ్ శంకర్ దర్శకుడు. సినిమా సెప్టెంబర్ 20న విడుదల కానుంది. ఈ సినిమా ప్రారంభం నుండి టైటిల్పై వివాదం నెలకొంది. బోయ కులస్థులు సినిమా టైటిల్ను మార్చాలంటూ నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ టైటిల్ వివాదం అనంతపురం పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య కేంద్ర టెలికమ్యూనికేషన్స్ అండ్ బ్రాడ్ క్రాస్టింగ్ మినిష్టర్ ప్రకాశ్ జవదేకర్ను కలిసి వాల్మీకి అనే పేరులా ఎలా పడితే అలా వాడేసుకుంటన్నారంటూ వినతి పత్రాన్ని అందించారు. తమిల చిత్రం జిగర్తండాకు ఇది రీమేక్
previous post
next post