Anant Ambani: ప్రముఖ వ్యాపారవేత్త మరియు దేశంలోనే అత్యంత ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. తాను ఎంత గొప్ప ధనవంతుడు అయినా తమ పిల్లల దగ్గర మాత్రం ఒక తండ్రి హోదాను పుచ్చుకున్నాడు. ఇక తాజాగా అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చ్ ఒకటి నుంచి మూడు వరకు జరిగాయి. జామ్ నగర్ లో ఈ కార్యక్రమం అంగరంగ వైభోగంగా జరుపుకున్నారు అంబానీ ఫ్యామిలీ.
ఇక ఈ ఈవెంట్ కి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు దేశంలోనే గొప్ప గొప్ప బిజినెస్ మాన్స్ సైతం హాజరయ్యారు. ఈ క్రమంలోనే రణవీర్, దీపిక పదుకొనే, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, ఆలియా భట్, సైఫ్ ఆలీ ఖాన్ వంటి వారు కూడా హాజరై సందడి చేశారు. అదేవిధంగా టాలీవుడ్ నుంచి మెగా స్టార్ రామ్ చరణ్, ఉపాసన హాజరయ్యారు. అంతేకాకుండా ఆనంద్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ ఈవెంట్లో ఫేస్బుక్ సహా వ్యాపారవేక్తుడు మార్క్ జుకర్బర్గ్, అతని భార్య పిల్లలు కూడా హాజరైన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ క్రమంలోనే అనంత్ అంబానీ చేతుకున్న వాచ్ చూసి జుకర్ బర్గ్ భార్య ప్రిసిల్లా ఆశ్చర్యపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో అనంత్ అంబానీ.. జుకర్ బర్గ్ అతని భార్యతో మాట్లాడుతూ కనిపించారు. ఇక ఈ క్రమంలోనే అతనితో మాట్లాడుతూ ఒక్కసారిగా జూకర్ బర్గ్ భార్య కళ్ళు ఆనంద్ అంబానీ వాచ్ పై పడ్డాయి. దీంతో అనంత్ అంబానీ ని ఆ వాచ్ గురించి అడిగి తెలుసుకుంది. ” ఇది చాలా అద్భుతంగా ఉంది.
ఈ వాచ్ ని ఏ కంపెనీ తయారు చేసింది? ” అని ప్రశ్నించింది. ఇక దీనికి అనంత్ అంబానీ సమాధానం ఇస్తూ..” రిషర్ మిల్ కంపెనీకి చెందిన వాచ్ ” అని సమాధానం ఇచ్చాడు అనంత్ అంబానీ. ఇక దీంతో..” నేను వాచ్లు కొనాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అనంత్ అంబానీ చేతిలో ఉన్న వాచ్ చూసి నా ఆలోచన మారిపోయింది. ఆ వాచ్ చాలా బాగుంది ” అని మార్క్ జుకర్ బర్గ్ అన్నారు. ఇక ఈ వాచ్ విలువ 14 కోట్లు ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక వాచ్ ని చూసి ఫిదా అయినా జోకర్ బర్గ్ భార్య రేటును చూసి కళ్ళు తేలేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!