గత కొద్ది కాలంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు తన సొంత పార్టీ వైసీపీ పై తీవ్రమైన ఆసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా అతను పార్టీపై కులపరమైన ఆరోపణలు చేశాడు. జగన్ చుట్టూ ఒక సరిహద్దు ఉంటుందని అతనిని కలవాలంటే ఆ సరిహద్దుని దాటుకుని వెళ్లాలి అని చెప్పడం గమనార్హం.
అలాగే ఈ మధ్య తెలుగుదేశం పార్టీల నాయకుల అరెస్టు విషయమై కూడా అతను ప్రభుత్వానికి వ్యతిరేక ధోరణిని ప్రదర్శించడం కూడా జగన్ ను బాగా ఇబ్బంది పెట్టింది. ఇక ఊరుకునే కొద్ది రఘురామకృష్ణంరాజు మరీ పెడ ధోరణి ని ప్రదర్శిస్తుంటే…. చివరికి జగన్ అతని విషయమై ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తోంది.
ఎంపీ రఘు రామకృష్ణమ రాజు ని వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ పార్టీ నుండి సస్పెండ్ చెయ్యబోతున్నార. రాజ్యసభ ఓటింగ్ వ్యవహారం పూర్తయిన తరువాత ఎంపీ పై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది.తెగే వరకూ లాగడమే సస్పెన్షన్ కి కారణం అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో ఎంపీ రఘు రామకృష్ణమ రాజు దిష్టి బొమ్మలను తగలబెట్టిన నాయకులు,కార్యకర్తల పై సంబంధిత పోలీస్ స్టేషన్స్ లో ఎంపీ రఘు రామకృష్ణమ రాజు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడానికి స్థానిక పోలీసులు నిరాకరించడంతో ఎంపీ రఘు రామకృష్ణమ రాజు కోర్టు ని ఆశ్రయించాడు.
ఇక ఈ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న అధిష్టానం ఎంపీ పై వేటుకి సిద్ధం అయ్యింది. అయితే ఎంపీ రఘు రామకృష్ణమ రాజు కి కూడా సస్పెన్షన్ పై ఉప్పు అందడంతో బిజెపి అధినాయకత్వంతో టచ్ లోకి వెళ్లారని సమాచారం. సస్పెన్షన్ అనంతరం తీసుకోవాల్సిన రాజకీయ నిర్ణయాలపై స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నారు రాజు గారు.