Nag aswin : నాగ్ అశ్విన్ మహానటి సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు. అలనాటి మహానటి సావిత్రి జీవిత కథని వెండితెర మీదకి తీసుకు వచ్చి ప్రతీ ఒక్కరి ప్రశంసలు అందుకున్నాడు. అభ్యంతరకరమైన సన్నివేశాలను సినిమాలో చూపించి మెప్పించడం నాగ్ అశ్విన్ గొప్ప విషయం. ఇక ఈ సినిమా తర్వాత అందరు మెగాస్టార్ తో నాగ్ అశిన్ సినిమా ఉంటుందని గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు. అందుకు కారణం మహానటి సినిమా చూసిన చిరంజీవి ప్రత్యేకంగా ప్రశంసించడమే కాదు.. మంచి స్క్రిప్ట్ తో రెడీ గా ఉంటే సినిమా చేద్దామని చెప్పడమే.
అయితే నాగ్ అశ్విన్ డార్లింగ్ ప్రభాస్ కోసం స్క్రిప్ట్ సిద్దం చేసుకోవడమే కాదు ప్రముఖ నిర్మాణ సంస్థలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందబోయే ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. అంతేకాదు ఈ సినిమా వైజయంతీ మూవీస్ కి 50 వ సినిమా కావడం గొప్ప విశేషం. అందుకే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ ఈ సినిమాకి క్రియేటివ్ హెడ్ గా వ్యవహరించడం మరో గొప్ప విషయం. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ప్రభాస్ కి జంటగా నటిస్తున్నట్టు అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర లో కనిపించబోతున్నట్టు ప్రకటించారు.
Nag aswin : నాగ్ అశ్విన్ ప్రభాస్ కోసం ఎంత కాలం వేయిట్ చేస్తాడు..?
కాని అనూహ్యంగా ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాకంటే ముందే మరో రెండు భారీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకతంలో ఆదిపురుష్ ఒక సినిమా కాగా .. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కామినేషన్ లో రూపొందబోతున్న సలార్. అయితే అందరు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఇప్పట్లో ఉండని ఈ గ్యాప్ లో నాగ్ అశ్విన్ మరో సినిమ చేస్తాడని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దాంతో నాగ్ అశ్విన్ స్పందిస్తూ నేను సినిమా అంటూ చేస్తే అది ప్రభాస్ సినిమా తర్వాతే. ఆయన కోసం వేయిట్ చేస్తాను తప్ప మరో ప్రాజెక్ట్ కమిటవనని తేల్చి చెప్పాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!