ఉత్తరాంధ్ర సీనియర్ నేత…. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్త ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో బాగా చర్చనీయాంశమైన అంశం. ఆ వార్త బయటకు వచ్చిన మొదట్లో పెద్ద సంచలనం సృష్టించగా ఇప్పటివరకు ఇందుకు సంబంధించి గంటా కానీ అతని అనుచరులు గాని ఈ విషయాన్ని ఖండించకపోవడం గమనార్హం. అయితే ఇటీవలే వైసిపి…. శ్రీనివాసరావు ‘సైకిళ్ళ’ కుంభకోణంలో ఇరుక్కున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. విజయసాయి రెడ్డి స్వయంగా విమర్శలు గుప్పించగా.. ఇక గంటాకు వైసీపీలో కష్టమే అని అందరూ అనుకున్నారు.
అయితే ఇదే సమయంలో ఒక్కసారిగా చిరంజీవి రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. అంతే…టిడిపి సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి చేరేందుకు ముహుర్తం ఖరారు అయినట్లు తెలిసింది. ముందుగా అవంతి శ్రీనివాస్ గంటా శ్రీనివాసరావు పైన తీవ్రమైన విమర్శలు చేసిన తర్వాత గంటా చిరంజీవితో జగన్ మంతనాలు జరిపించినట్లు వైసీపీ వర్గాల్లో వార్తలు జోరందుకున్నాయి. జగన్ కు మరియు చిరంజీవికి ఫోన్ లో మాట్లాడుకునేంత సాన్నిహిత్యం ఉంది అన్న విషయం తెలిసిందే. అలాగే గంటా శ్రీనివాసరావు చిరంజీవికి ఆప్తుడు మరియు అత్యంత సన్నిహితుడు.
ఈ నేపథ్యంలో చిరంజీవి దగ్గరుండి జగన్ కు గంటా చేరిక విషయమై సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా ఆగస్టు 15న గంటా వైసీపీలో చేరనున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు చూస్తే ఈ చేరిక ఆగస్టు 16కి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగబోతోందని తెలిసింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చిరంజీవి జగన్ కు గంటా శ్రీనివాసరావు తో పాటు మరి కొందరు టిడిపి నాయకులు కూడా వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు…. ఇక ఉత్తరాంధ్రలో నిలువరించే ఎదురే ఆయనకు ఉండబోదని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఇక చిరంజీవిపై అపారమైన గౌరవం జగన్…. గంటా చేరికకు తల ఊపినట్లు సమాచారం. ఇక ఇలాగే క్రమంగా చిరంజీవి కూడా వైసీపీ లో చేరుతారా… లేదా తను తమ్ముడు పవన్ కళ్యాణ్ ను హర్ట్ చేయడం ఇష్టం లేక ఆగిపోతారా అని పోల్స్ కూడా ఇప్పుడు మొదలుపెట్టేస్తున్నారట.