ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై కీలక అడుగు పడింది. రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటు విషయమై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.
దీని ప్రకారం ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీకి కన్వీనర్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరించనున్నారు. మూడు నెలల లోపు ఈ కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటుపై సంపూర్ణ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవలే క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా సీఎస్ పైన చెప్పిన విధంగా ఉత్తర్వులు జారీ చేసారు.