ఇకపై మీరు టోల్ ప్లాజాల్లో నగదు చెల్లించక్కర్లేదు. టోల్ ప్లాజాల్లో నగదు చెల్లించే పద్ధతికి టోల్ ప్లాజా ఇక శాశ్వతంగా గుడ్ బై చెబుతోంది. ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద ఉన్న క్యాష్ లైన్స్ ను ఇక నుంచి ఫాస్టాగ్ లేన్స్ (FASTag lanes) గా మారుస్తున్నట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) స్పష్టంచేసింది. జనవరి 1 నుంచి pre-paid touch-and-go cards సేవలను టోల్ ప్లాజాల వద్ద అందుబాటులోకి తీసుకురానున్నారు.
టోల్ ప్లాజాల వద్ద వందలాది వాహనాలు గంటల తరబడి బారులుతీరి ఉండిపోతున్నందున ఈ కొత్త టెక్నాలజీని NHAI ప్రవేశపెట్టనుంది. హైబ్రిడ్ లేన్స్ లో ఈ ప్రీ పెయిడ్ కార్డు విధానాన్ని ప్రవేశ పెడితే ట్రాఫిక్ కష్టాల నుంచి భయటపడవచ్చని NHAI భావిస్తోంది. కాబట్టి జనవరి 1 నుంచి టోల్ ప్లాజాల వద్ద ఉన్న అన్ని లేన్లు ఫాస్టాగ్ లేన్లుగా మారనున్నాయి. మరియు NHAI విధించిన ముఖ్య నిబంధన ఏమనగా ఫాస్టాగ్ లేకపోతే పెనాల్టీగా రెట్టింపు మొత్తాన్ని చెల్లించాలిసి ఉంటుంది.