ఏపి శాసనసభ శీతాకాల సమావేశాల్లో మూడవ రోజైన బుధవారం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లు, అసైన్డ్ భూముల లీజు అంశాలపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ అంశంపై చర్చించడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో సభ నుండి టీడీపీ వాకౌట్ చేసింది. కొద్దిసేపటిలో పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరుగనున్నది.
కాగా ఏపి వాల్యూయేటెడ్ ట్యాక్స్, థర్డ్ అసైన్ మెంట్ బిల్లును డిప్యూటి స్పీకర్ నారాయణ స్వామి సభలో ప్రవేశపెట్టారు. తొలుత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లును ప్రవేశపెట్టగా, డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాసు అసైన్డ్ ల్యాండ్ బిల్లును. హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత దిశ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ కీలక బిల్లులపై సభలో చర్చ జరుగుతోంది.