యంగ్ హీరో నితిన్ చాలాకాలం తర్వాత భీష్మ సినిమాతో మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకున్నాడు. ఈ ఊపుతో వరసగా సినిమాలు చేయాలని అనుకున్నాడు. అందుకే 3-4 ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. ఇంతలో కరోనా వచ్చి నితిన్ ప్లాన్స్ మొత్తం తారుమారు చేసింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన రంగ్ దే తో మరో భారీ హిట్ అందుకోవాలనుకున్నాడు నితిన్. కాని ఈ సినిమా రిలీజ్ కాకుండానే థియోటర్స్ మూతపడ్డాయి. ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఇంకా క్లారిటీ రావడం లేదు. దాంతో ఈ సినిమాని ఓటీటిలో రిలీజ్ చేయాలనై నితిన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.
థియోటర్స్ మూత పడ్డాక పే పర్ వ్యూ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే క్రేజ్ లేని హీరోల సినిమాల్ని డబ్బు చెల్లించి ఓటీటీలో చూడాలన్న ఆసక్తి ఎవరికీ ఉండటం లేదు. కానీ నితిన్ లాంటి క్రేజీ హీరో సినిమాకి ఈ విధానం లో సినిమా రిలీజ్ చేస్తే లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల నాని సుధీర్ బాబు నటించిన వి సినిమా ఇదే పాయింట్ తో రిలీజ్ చేశారు.
ఇప్పుడు నితిన్ నటించిన ‘రంగ్ దే’ ఓటీటీలో రిలీజ్ కాబోతుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం ఇంకా ఎలాంటి అధికారిక సమాచారాన్ని ఇవ్వలేదు. కాని ఇప్పటికే ఈ సినిమా జీ5 వాళ్లకు అమ్మేశారని జీ ప్లెక్స్ లో పే పెర్ వ్యూ విధానంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని లేటెస్ట్ అప్డేట్. ఇక ఓటీటీ డీల్ రూపంలోనే 20శాతం లాభం ముందే వచ్చేసిందన్న మాట కూడా వినిపిస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందన్నది మేకర్స్ వెల్లడించాల్సి ఉంది. ఇక నితిన్ ఈ సినిమా తర్వాత బాలీవుడ్ హిట్ సినిమా అంధాదున్ రీమేక్ లో నటించనున్నాడు. అలాగే చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుందని సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!