పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2021 టార్గెట్ చాలా పెద్దదే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ ని 2021 లో రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ఫినిష్ చేస్తున్నారు. ఈ సినిమాలో నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. శృతి హాసన్ గెస్ట్ రోల్ లో నటిస్తుంంది.
ఇక ఈ సినిమా తర్వాత అయ్యప్పనం కోషియం సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించబోతుండగా రానా మరో హీరోగా నటించే అవకాశాలున్నాయి. అలాగే ఈ సినిమా చేస్తూనే క్రిష్ సినిమాకి డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. ఏ.ఎం.రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. 5 – 6 నెలల్లో ఈ రెండు సినిమాలని కంప్లీట్ చేసి ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో పవన్ కళ్యాణ్ జాయిన్ కాబోతున్నాడు.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ రిపీటవుతుండటంతో అంచనాలు ఊహకందనంతగా ఉన్నాయి. కాగా పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ నిర్మాణంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రం శ్రీనివాస్ తెరకెక్కిస్తాడని సమాచారం. ఇప్పటికే కోన వెంకట్ కథ సిద్దం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయట.
ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేసేందుకు కమిటయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అఖిల్ 5 సెట్స్ మీదకి తీసుకు వెళ్ళ బోతున్నాడు. ఈ సినిమా కంప్లీట్ చేయగానే పవన్ కళ్యాణ్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాం తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమా 2022 లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి వకీల్ సాబ్ తర్వాత నాన్ స్టాప్ గా సినిమాలని పవన్ కళ్యాణ్ సెట్స్ మీదకి తీసుకు రానున్నాడు. ఇది కదా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కావాల్సింది
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!