యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత పెద్ద కమర్షియల్ సక్సస్ ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ని త్రివిక్రం యాక్షన్ హీరోగా అద్భుతంగా చూపించాడు. దాంతో మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీటవుతుందని నందమూరి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూశారు. అనుకున్నట్టుగానే ఎన్.టి.ఆర్ 30 ని త్రివిక్రం రూపొందిస్తున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించేందుకు త్రివిక్రం స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఎన్.టి.ఆర్.. ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. సమ్మర్ టార్గెట్ గా ఆర్ ఆర్ ఆర్ ని కంప్లీట్ చేయాలని రాజమౌళి బృందం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజయ్యాక ఎన్.టి.ఆర్ 30 ప్రారంభం అవుతుందని తెలుస్తుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఆగష్టు నుండి స్టార్ట్ చేసి 2022 సంక్రాతికి టార్గెట్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఆ ఇద్దఇలో ఒక హీరోయిన్ పొడుగు కాళ్ళ సుందరి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. హాట్ బ్యూటీ పూజా హెగ్డే నటించబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే పూజా ఎన్.టి.ఆర్ కలిసి నటించిన అరవింద సమేత బాగా ఆకట్టుకుంది. అందుకే మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇప్పటికే తన హాట్ నెస్ తో పూజా జనాలకి వేడి పుట్టిస్తుంది. ఇక మరో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!