Ongole(prakasam): అవినీతి అధికారుల భరతం పడుతోంది అవినీతి నిరోధక శాఖ. అవినీతి లేకుండా ప్రజలకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చెబుతున్నా వివిధ శాఖల్లో అధికారులు తమ అవినీతి కార్యక్రమాలను యదేశ్చగా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఫిర్యాదులు అందితే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అవినీతికి పాల్పడుతున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేస్తున్నారు. అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నారు. అయితే దొరికిన వాడే దొంగ దొరకని వారు దొర అన్నట్లుగా ప్రస్తుతం ఉంది.
ఓ పక్క పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడే అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకుంటున్నా ఆ శాఖలో కొందరు ఎటువంటి భయం లేకుండా తమ అవినీతిని కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా పది రోజుల క్రితమే ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మహిళా ఎస్ఐ దీపిక భార్య భర్తల మధ్య గొడవలో కేసు నుండి నిందితులను తప్పించేందుకు రూ.45వేలు లంచం నగదును ఓ కానిస్టేబుల్ ద్వారా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఈ ఘటన మరువక ముందే ఒంగోలు పట్టణంలో సోమవారం ఓ ఎస్ఐ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.
ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న మహబూబ్ బాషా ఓ కేసులో విషయంలో బాధితుల వద్ద నుండి రూ.40వేలు లంచం తీసుకుంటుండగా సోమవారం రాత్రి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CM KCR TSRTC: జగన్ బాటలో కేసిఆర్ .. ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు